Sunday, May 5, 2024

మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లిని కలిసిన టీఎస్ఎస్జీడీసీ ఛైర్మన్

తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎస్జీడీసీ) చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తన జన్మదినం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావును, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఛైర్మన్ గా నియమించడం పట్ల అభినందిస్తూ.. సీఎం తనపై ఉంచిన ఈ నమ్మకంను నిలబెట్టుకునేలా పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అందరికీ చేరేలా బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement