Friday, April 26, 2024

‘పుల్వామా’ ఆఖ‌రి ఉగ్ర‌వాదిని హ‌తం చేసిన సైన్యం

పుల్వామా ఉగ్ర‌దాడిలో పాల్గొన్న చివ‌రి టెర్ర‌రిస్టుని భార‌త బ‌ల‌గాలు కాల్చిచంపాయి. పుల్వామా దాడిలో పాల్గొన్న ఉగ్ర‌ద‌వాదుల‌ను గ‌తంలో ప‌లు ఎన్ కౌంట‌ర్ల‌లో సైన్యం తుద‌ముట్టించిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజా ఘ‌ట‌న‌తో పుల్వామా ముష్క‌రులు అంద‌రినీ అంత‌మొందించిన‌ట్లే. కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో సమీర్ దార్ అనే ఈ ఉగ్రవాదిని హతమార్చినట్టు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. సమీర్ దార్ జైషే ఉగ్రవాద సంస్థలో అగ్రశ్రేణి కమాండర్.

డిసెంబరు 30న జరిగిన ఎన్ కౌంటర్ లో సమీర్ దార్ తో పాటు మరో ఇద్దరిని కూడా మట్టుబెట్టినట్టు విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటన మొన్ననే జరిగినప్పటికీ, డీఎన్ఏ టెస్టులు జరిపిన అనంతరం సమీర్ దార్ గుర్తింపును నిర్ధారించారు. మూడు సంవ‌త్స‌రాల క్రితం 2019 ఫిబ్ర‌వ‌రి 14 పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడి యావ‌త్ భార‌త‌దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు విరుచుకుపడిన ఆనాటి ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement