Monday, May 6, 2024

TSPSC – ప్రారంభమైన గ్రూప్ 4 పరీక్ష..

పెద్దపల్లి – గ్రూప్ 4 పరీక్ష ప్రారంభమైంది.. శనివారం పెద్దపల్లి జిల్లాలో 43 పరీక్ష కేంద్రాల్లో 17,927 మంది అభ్యర్థులు పరీక్ష హాజరయ్యారు. పరీక్ష కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.

ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ పోలీస్ యంత్రాంగం పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన చర్యలు చేపట్టింది. బందోబస్తును పెద్దపెల్లి ఏసిపి మహేష్ పర్యవేక్షించగా సిఐ అనిల్, ఎస్ఐ మహేందర్ లతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement