Friday, May 17, 2024

Breaking | ప్రారంభమైన గ్రూప్ 4 పరీక్ష.. తనిఖీ చేసి అనుమతించిన పోలీసులు

గ్రూప్ 4 పరీక్ష ప్రారంభమైంది.. శనివారం పెద్దపల్లి జిల్లాలో 43 పరీక్ష కేంద్రాల్లో 17,927 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.

ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన చర్యలు చేపట్టింది. బందోబస్తును పెద్దపెల్లి ఏసీపీ మహేష్ పర్యవేక్షిస్తున్నారు. సీఐ అనిల్, ఎస్ఐ మహేందర్​తో పాటు సిబ్బంది డ్యూటీలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement