Wednesday, May 15, 2024

TSEDCET Results – 98.18 శాతం ఉత్తీర్ణత… తాండూరు విద్యార్ధిని వినీషకు ఫస్ట్, నీశాకు రెండో ర్యాంక్

హైదరాబాద్ – టీఎస్ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలను సోమవారం సాయంత్రం ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, వైస్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. వెంకటరమణ, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

విద్యార్థులు ఫలితాలను https://edcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. కాగా, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎడ్‌సెట్‌ పరీక్షను మే 18న మూడు సెషన్లలో నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా 27,495 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 26,994(98.18 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు లింబాద్రి ప్రకటించారు. తాండూరుకు చెందిన జి. వినీష మొదటి ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన నీశా కుమారి రెండో ర్యాంకు సాధించినట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement