Sunday, April 28, 2024

TS విద్యుదాఘాతంతో ముగ్గురు యువకుల దుర్మరణం

వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం మోత్యా తండాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు దేవేందర్‌, రవి, సునీల్‌గా గుర్తించారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కరెంట్‌ షాక్‌తో విషాదం అలుముకున్నది. మంగళవారం దుర్మమ్మ పండుగ నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌ తగిలినట్లు సమాచారం. ఈ క్రమంలో సంఘటనా స్థలంలోనే దేవేందర్‌ మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా.. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. పండుగకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదం అలుముకున్నది

Advertisement

తాజా వార్తలు

Advertisement