Wednesday, May 1, 2024

సంక్రాంతికి అదనంగా 55లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చిన టీఎస్ఆర్టీసీ

ఈ సంక్రాంతి పండగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థమై నాలుగు వేల బస్సులను, షెడ్యూల్ బస్సులతో పాటు అదనంగా నడిపి, 55లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చిందని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ (ఐ.పి.యస్) తెలిపారు. వారు మాట్లాడుతూ… దాదాపుగా 55 లక్షల మంది ప్రయాణీకులను ఎలాంటి అధనపు ఛార్జీలు లేకుండా ప్రజా సేవయే లక్ష్యంగా వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడం జరిగిందన్నారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు కల్పించిన రవాణా సౌకర్యాల ద్వారా సంస్థకి రూ.107 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు టీఎస్ ఆర్టీసీని ఆదరించడం పట్ల టిఎస్ఆర్టీసీ యజమాన్యం తరపున ప్రయాణీకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామ‌న్నారు. ఇక ముందు కూడా ఇదే విధంగా టీఎస్ఆర్టీసీని అదరిస్తూ సంస్థ అభివృద్దికి చేయూతనివ్వాల‌ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement