Monday, April 29, 2024

TS సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం – హైకోర్టులో ర‌జ‌త్ కుమార్ పిటిష‌న్

సోష‌ల్ మీడియాలో అవినీతి ఆరోప‌ణ‌లు
త‌న కూతురు పెళ్లి ఖ‌ర్చుల‌పై త‌ప్పుడు రాత‌లు
ప్ర‌భుత్వం క్లీన్ చిట్ ఇచ్చినా ఆగ‌ని నింద‌లు
వాటిని నియంత్రించాల‌ని హైకోర్టుకు మొర
ప్ర‌తివాదులుగా ఐటీ శాఖ, గూగుల్, యూట్యుబ్

తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అరిక‌ట్టాల‌ని, అలాంటి వాటిని నెట్‌లో తొలగించేలా ఆదేశించాల‌ని సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌, మాజీ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ కోర్టుకెక్కారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, తన బిడ్డ పెండ్లి ఖర్చుపై తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో రజత్ కుమార్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని, ఇప్పటికే ఉన్న కథనాలను తొలగించాలే ఆదేశించాలని పిటిషన్ లో కోరారు.

కేంద్ర ఐటీ శాఖ‌, గూగుల్‌, యూట్యూబ్ ప్ర‌తివాదులుగా..

త‌న పిటిష‌న్‌లో కేంద్ర ఐటీ శాఖ, గూగుల్, యూట్యుబ్‌ని ప్రతివాదులుగా చేర్చారు ర‌జ‌త్‌కుమార్‌. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో గతంలో తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించిందని, తాను ఏ తప్పూ చేయలేదని తేలడంతో క్లీన్ చిట్ ఇచ్చిందని వివరించారు. దీనికి సంబంధించిన రిపోర్టు కాపీని కోర్టుకు సబ్మిట్ చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ సూరేపల్లి నందా బుధ‌వారం విచార‌ణ‌కు స్వీక‌రించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement