Friday, April 26, 2024

TS Politics: ఒక్క చాన్స్ ఇస్తే.. ప్ర‌జ‌ల‌ గొంతుకగా నిలబడతా: కాంగ్రెస్ అభ్య‌ర్థి బల్మూరి

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు హుజురాబాద్ మున్సిపాలిటీలోని బోర్నపల్లి, విద్యానగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి బ‌ల‌మూరి వెంక‌ట్ ఇంటింటి ప్రచారం నిర్వ‌హించారు. మ‌తం పేరుతో విద్వేషాలు రెచ్చ‌గొడుతున్న బీజేపీకి.. కులాల పేరుతో ప్ర‌జ‌ల‌ను అవ‌మాన ప‌రుస్తున్న టీఆర్ ఎస్‌కు కాకుండా.. ప్ర‌జ‌ల‌ గొంతుకుగా నిలిచే త‌న‌కు ఒక్క చాన్స్ ఇవ్వాల‌ని కాంగ్రెస్ అభ్య‌ర్థి వెంక‌ట్‌ విజ్ఞ‌ప్తి చేశారు.

TRS రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకొని కౌలు రైతులకు అన్యాయం చేస్తోంద‌న్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను.. ఫీజు రీయింబ‌ర్స్మెంట్‌ ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేయడంలో టీఆర్ ఎస్‌కు మోసం చేస్తోందని.. ఇది ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌న్నారు.

ఎన్నికలప్పుడు రైతు బంధు పడుతున్నపుడు.. మ‌రి అంద‌రికీ దళిత బంధు ఎందుకు ప‌డ‌ద‌ని వెంక‌ట్ ప్ర‌శ్నించారు. ఇది TRS BJP క‌లిసి ఆడుతున్న నాట‌కంగా ఆయ‌న విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కరీంనగర్ డీసీసీ కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, లక్ష్మణ్ కుమార్, మంచిర్యాల డీసీసీ చైర్‌ప‌ర్స‌న్‌ సురేఖ, బొమ్మ శ్రీరామ్, జువ్వాడి నర్సింగ్ రావ్, బీర్ల ఐలయ్య, కిరణ్, తిరుపతి, కుమార స్వామితో పాటు జిల్లా నాయకులు, మండల నాయకులు, యువజన కాంగ్రెస్ నేత‌లు, NSUI నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement