Friday, March 29, 2024

TS Politics: రైల్వేలైన్ పనులు రిజెక్ట్ అయినా.. ఈ ’బండి‘కి చలనం రాలే!

Huzurabad By Poll: కరీంనగర్ ఎంపీగా గెలిచి రెండున్నర సంవత్సరాలు గడిచినా బండి సంజయ్ మాత్రం జిల్లాకు ఒక్క రూపాయి కూడా కొత్తగా తీసుకుని రాలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. హుజురాబాద్ లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఎంపీగా బండి సంజయ్ జిల్లా అభివృద్ధి కోసం పట్టుబట్టి పనులు చేయాలని సూచించారు.

కాజీపేట-హుజురాబాద్-మానకొండూర్-కరీంనగర్ రైల్వే లైన్ పనుల ప్రతిపాదనలను రైల్వే శాఖ రిజెక్ట్ చేసిందని, ఆ పనులను సాధించేందుకు సంజయ్ చిత్తశుద్ధితో కృషి చేయాలని వినోద్ కుమార్ సూచించారు.

గతంలో హైదరాబాద్-మనోహరాబాద్-గజ్వేల్-సిద్దిపేట-సిరిసిల్ల-వేములవాడ-కరీంనగర్ రైల్వే లైన్ పనులను రైల్వే శాఖ రిజెక్ట్ చేస్తే కరీంనగర్ ఎంపీగా వెంటపడి, పట్టుబట్టి పనులను సాధించినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఈ రైల్వే లైన్ పనులను సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని బండి సంజయ్ కు ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement