Friday, May 10, 2024

TS | టీ-సాట్‌లో 5 గంటలపాటు గ్రూప్‌-2 క్లాసులు : సీఈవో శైలేష్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-2 పోటీ పరీక్షలకు గురువారం నుండి మరో మూడు గంటలపాటు అదనంగా పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నట్లు టి-సాట్‌ సీఈవో రాంపురం శైలేష్‌ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల రోజులుగా ప్రతి రోజూ రెండు గంటలు ప్రసారాలు అందించిన టీ-సాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లు మరో మూడు గంటల అదనపు ప్రసారాలు పెంచుతూ ఈరోజు నుంచి ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ప్రసారాలు కొనసాగించనున్నట్లు ఆయన ప్రకటించారు.

నిపుణ ఛానళ్లలో సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఇంగ్లీష్‌, జాగ్రఫీ, తెలంగాణ ఉద్యమం, చరిత్ర, ఎకానమీ సబ్జెక్టులపై ప్రసారాలుంటాయని, మరుసటి రోజు విద్య ఛానల్‌లో తెల్లవారు జామున ఐదు గంటల నుండి 10 గంటల వరకు పున:ప్రసారాలుంటాయని తెలిలిపారు. గ్రూప్‌-2 పరీక్ష ఆగస్టు 29, 30తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించడంతో అభ్యర్థులకు మరిన్ని పాఠ్యాంశాలు అందించాలన్న ఉద్ధేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శైలేష్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement