Sunday, May 19, 2024

తిరుచానారు అమ్మవారికి వెండి పాత్రలు బహుకరణ..

విజయవాడ, ప్రభ న్యూస్ : తిరుమల దేవస్థానం తిరుచానూరు (తిరుపతి) పద్మావతి అమ్మవార్ల దేవస్థానానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేసినేని ఫౌండేషన్ అధినేత కేసినేని శివనాద్ దంపతులు వెండి పాత్రలను బహుకరించారు. తిరుచానారు దేవాలయంలో ఆహార వినియోగం కోసం వెండి పాత్రలను తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని) జానకి దంపతులు బుధవారం అందజేశారు. దేవస్థానం అధికారులను కలిసి అమ్మవారికి బహుమతిగా ఈ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేశినేని వెంకట్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement