Sunday, May 19, 2024

TS : రేపు వేములవాడలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

ఇవాళ తెలంగాణ‌కు మ‌రోసారి ప్ర‌ధాని మోదీ రానున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాత్రి ప్ర‌త్యేక విమానంలో బేగంపేట విమానాశ్ర‌యానికి వ‌స్తారు. అక్క‌డి నుంచి రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్తారు. రాత్రి అక్క‌డే బ‌స చేస్తారు. రేపు ఉద‌యం రాజ్‌భ‌వ‌న్ నుంచి బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకొని అక్క‌డి నుంచి హెలికాప్టర్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు ప్రధాని వెళ్లనున్నారు.

- Advertisement -

వేములవాడలో కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. వేములవాడ సభ ముంగించుకుని వరంగల్ కు బయల్దేరి.. బీజేపీ లోక్ సభ అభ్యర్థి ఆరూరి రమేశ్కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ సభ అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు. ప్రధాని హాజరయ్యే సభలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇప్పటికే సభలకు సంబంధించి దాదాపు ఏర్పాట్లు పూర్తి కాగా.. జన సమీకరణపైన ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement