Monday, April 29, 2024

Farmers Day: రైతులకు టీఆర్ఎస్ అండా: కవిత

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. మానవాళికి అన్నం పెట్టేందుకు అహర్నిషలు శ్రమిస్తున్న అన్నదాతలందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు అని అన్నారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, 24 గంటల కరెంట్ లాంటి అనేక పథకాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. వ్యవసాయాన్ని పూర్తి లాభసాటిగా మార్చారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కృషితో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా ముందుండి పోరాడే పార్టీ టీఆర్ఎస్ అని తెలిపారు. వడ్లు కొనబోమంటూ రైతులకు తీరని అన్యాయం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఎందాకైనా కొట్లాడేందుకు టీఆర్ఎస్ సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. రైతు శ్రేయస్సే టీఆర్ఎస్ ప్రధాన ఎజెండా అని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement