Friday, May 3, 2024

ప్రతి గింజ కొనాల్సిందే.. పెద్దపల్లిలో రైతుదీక్ష

తెలంగాణలో పండిన ప్రతి ధాన్యపు గింజను కేంద్రం కొనాల్సిందే అని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. గురువారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష చేపట్టారు. కేంద్రం తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపరాదన్నారు. దీక్షలో పెద్దపల్లి, రామగుండం శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, రఘువీర్ సింగ్, లక్ష్మణ్ తో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement