Sunday, May 5, 2024

వారిది పగటి కలలే: గుత్తా

హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటున్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో ఖాయం అయిందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సుభిక్షంగా, చల్లగా ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు కేసీఆర్, కేటీఆర్ ల మీద బురద జల్లే ప్రయత్నం మానుకోవాల‌ని సూచించారు. కేవలం అధికార యావ తప్ప ప్రజల సంక్షేమం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పట్టవని విమర్శించారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డిల తీరు చడ్డీ గ్యాంగ్‌ల‌ను తలపిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement