Friday, April 26, 2024

ముస్లిం సమాజాభివృద్ధికి కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్

ముస్లిం సమాజాభివృద్ధికి కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ముస్లింలు చేసిన సామూహిక ప్రార్ధనల్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. అల్లా దయతో ప్రపంచ మానవాళి సంతోషంగా ఉండేలా కఠిన, ఉపవాస దీక్షలు చేయడం హర్షణీయం అన్నారు. అన్ని వర్గాల ఆచారాలు, సంప్రదాయాలు గౌరవించే విధంగా టీఆర్ఎస్ పాలన సాగుతుందన్నారు. క్రిస్మస్, రంజాన్,దసరా పండుగలు పేదల ఇండ్లలో సంతోషంగా జరగాలన్నది సీఎం కేసీఆర్ అభిమతమన్నారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతంగా ఉందని మంత్రి జగదీష్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement