Monday, April 29, 2024

రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న – మంత్రి కొప్పుల

సుప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రి కొప్పుల దంపతులకు అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రికి స్వామి వారి చిత్ర పటం తో పాటు ప్రసాదాలు అందజేశారు.మంత్రి తో పాటు జగిత్యాల జెడ్పీ వైస్ ఛైర్మన్ హరిచరణ్, జెడ్పీ చేర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, ఈ.ఓ రమాదేవి తోపాటు పలువురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement