Tuesday, May 21, 2024

ఢిల్లీలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం హడావుడి.. తెలంగాణ భవన్‌లో భారీ పోస్టర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకల హడావుడి దేశ రాజధాని న్యూఢిల్లీ వరకు చేరుకుంది. తెలంగాణ భవన్‌లో గోదావరి బ్లాక్ భవనానికి 8 అంతస్తుల ఎత్తున భారీ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ సాయి పేరుతో ఏర్పాటు చేసిన ఈ పోస్టర్ ఆ ప్రాంతంలో చూపరులను ఆకట్టుకుంటోంది. గతంలో వరి ధాన్యం కొనుగోళ్ల అంశంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్ష సమయంలోనూ తెలంగాణ సాయి భారీ పోస్టర్ ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement