Sunday, May 5, 2024

ఘోర రోడ్డు ప్ర‌మాదం : ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు యువ‌కులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. లారీ, బైక్‌ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. వివ‌రాల్లోకి వెళ్తే…. చేగుంట మండల కేంద్రం అనంతసాగర్ రోడ్‌లోని జీవికా కంపెనీ నుంచి వస్తున్న లారీని బైక్‌ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పల్లె రాకేష్ (21) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు దవాఖానకు తరలిస్తుండగా పల్లె ప్రదీప్ (17) పండ్ల అరవింద్‌ (15) మార్గమధ్యంలో మృతి చెందారు. కాగా, పల్లె ప్రదీప్ చేగుంట ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, పండ్ల అరవింద్ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరిని ప్రదీప్ అన్న పల్లె రాకేష్ చేగుంటలో బైక్‌పై డ్రాప్ చేసేందుకు వెళ్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. చ‌నిపోయిన ముగ్గురు యువకులూ ఒకే గ్రామానికి చెందిన వారు కావ‌డంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement