Thursday, April 25, 2024

జపాన్ పై భారత్ ఘ‌న‌విజ‌యం..

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టొర్నీ రౌండు రాబిన్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 6-0 తేడాతో జపాన్‌పై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌సింగ్‌ (10, 53నిమిషాల్లో) రెండు గోల్స్‌ సాధించగా, దిల్‌ప్రీత్‌సింగ్‌ (23నిమిషం), జరమ్‌ప్రీత్‌సింగ్‌ (34వ నిమిషం), సుమిత్‌ (46వ నిమిషం), షంషేర్‌సింగ్‌ (54వ నిమిషం) తలో గోల్‌ చేసి జపాన్‌ను చిత్తుగా ఓడించారు.

కాగా ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న మన్‌ప్రీత్‌సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. దక్షిణ కొరియా 6పాయింట్లు, జపాన్‌ 5పాయింట్లు, పాకిస్థాన్‌ 2పాయింట్లుతో ఉండగా ఆతిథ్య బంగ్లాదేశ్‌ ఒక్క పాయింట్‌ సాధించలేకపోయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement