Friday, May 24, 2024

అర్శపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు దుర్మరణం

నిజామాబాద్ అర్బన్. . . నగర శివారులోని అర్సపల్లి బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం నిజామాబాద్ నుంచి రెంజల్ మండలం దూ పల్లి వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఐ చర్ వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. సంఘటన జరిగిన ప్రాంతంలో అతివేగంతో రెండు వాహనాలు ఢీకొట్టుకోగా మృతదేహాలతో పరిస్థితి భయానకంగా మారింది. గాయపడిన వారిని జిల్లా అసుపత్రికి తరలించారు. నిజామాబాద్ లో భవన నిర్మాణ పనులు చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది సంఘటన స్థలానికి ఆరవ టౌన్ పోలీస్ లు చేరుకుని విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement