Wednesday, May 8, 2024

NZB: మూడు ఇళ్లల్లో దొంగతనం.. భారీ నగలు, నగదు మాయం

ఇందల్ వాయి, జులై 19 ప్రభ న్యూస్ : నిజామాబాద్ జిల్లా మండలంలోని నల్లవెళ్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మూడు ఇళ్లల్లో తాళాలు పగులగొట్టి.. ఇంట్లోకి దూరి చోరీచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దోపిడీ దొంగలు హల్చల్ చేసిన ఘ‌ట‌న‌ స్థానిక సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది. చోరీ ఎంత మొత్తంలో జరిగింద‌నే పూర్తి వివరాలు తెలియలేదు. ఏది ఏమైనా ఇందల్ వాయి గ్రామంలో జరిగిన చోరీ మిస్టరీ చేదించక ముందే మరో చోరీ జరగడం కొసమెరుపు. దీంతో ప్రజలు పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement