Thursday, May 2, 2024

మోర్‌ సూపర్ మార్కెట్‌లో చోరీ

తాండూరు, ప్రభన్యూస్ : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్‌లో చోరీ యత్నం జరిగింది. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. మోర్ సూపర్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోర్‌ సూపర్ మార్కెట్‌లో గుర్తుతెలియని దుండగులు షాపింగ్ సెట్టర్‌లను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు సంఘటనలు కనిపిస్తున్నాయి.

విషయం తెలుసుకున్న తాండూరు పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ పుటేజీ ద్వారా ఆధారాలను పక్కాగా సేకరిచేందుకు చర్యలు చేపట్టారు. సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు మోర్ సూపర్ మార్కెట్‌లోని క్యాష్‌ కౌంటర్‌లో నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement