Sunday, April 28, 2024

ఆస్ప‌త్రిలో మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన వైద్యులు

భైంసా ఏరియా ఆస్ప‌త్రిలో మహిళకు గుండెపోటు వ‌చ్చింది. దీంతో వైద్యులు కాశీనాథ్ ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణాల కాపాడారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. ముధోల్ మండల కేంద్రానికి చెందిన శోభ(45) తన కూతురిని ఆసుపత్రికి తీసుకువచ్చింది. శోభ అప్పటికప్పుడు అపస్మారక స్థితికి వెళ్లడం.. గుండెపోటు రావడంతో వెంటనే అక్కడున్నవారు కేకలు వేశారు. ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కాశీనాథ్ ఆమెకు సీపీఆర్ చేయ‌డంతో ప్రాణాలతో బయటపడింది. ఆమెకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కాశీనాథ్, డాక్టర్ మేఘనను సిబ్బంది సతీష్ రోహిదాస్ ను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement