Monday, May 6, 2024

శిఖండీలను భగభగ కాల్చే సూర్యుడు కేసీఆర్ : మంత్రి గంగుల‌

స్వార్థ రాజకీయాలు చేసే శిఖండీలను భగభగ కాల్చే సూర్యుడు కేసీఆర్ అని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి గంగుల మీడియాతో మాట్లాడుతూ…జిల్లాలో కొంతమంది శిఖండి రాజకీయాలు చేస్తున్నారని, ఆ శిఖండీలను భగ భగ మంటల్లో కాల్చి వేసే తేజోమయ సూర్యుడు కేసీఆర్ అని మంత్రి అన్నారు. స్థానిక సంస్థల్లో తమకు బలం లేదని కాంగ్రెస్, బీజేపీలు పోటీ నుంచి తప్పుకున్నాయని, సంపూర్ణ మెజారిటీ టీఆర్ఎస్ కు ఉంది కాబట్టి ఏకగ్రీవంకు ప్రయత్నం చేశామన్నారు..

కానీ కొందరు కడుపుమంట కలిగిన వ్యక్తులు స్వార్థంతో పోటీలో నిలిచారని దుయ్యబట్టారు. ఐనా ఎన్నిక ఏకపక్షమే అన్నారు. క్రమశిక్షణకు మారుపేరైన టిఆర్ఎస్ పార్టీ అదే ఒరవడిని కొనసాగించింద‌న్నారు. జిల్లాలోని 1324 ఓట్లలో 986 కు పైగా టీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచినవేనని, అవన్నీ టీఆర్ఎస్ కే పడ్డాయన్నారు. బీజేపీకి ఉన్న సభ్యుల ఓట్లు వారికే పడ్డాయా ? లేదా ? ఒక వేల తగ్గితే ఆ బాధ్యత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీసుకుంటారా ? లేదా ఈటల రాజేందర్ తీసుకుంటారా ? తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ సభ్యులంతా ఐకమత్యంగా ఏకతాటిపై ఉన్నారని, అలాగే బీజేపీ సభ్యులు ఉన్నారా లేదా చెప్పాలన్నారు. ఈనెల 14న భారీ మెజార్టీతో గెలవడం ఖాయమ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement