Saturday, May 4, 2024

మాస్టారు చేతివాటం.. విద్యార్థి మృతి

వికారాబాద్, మార్చి 4(ప్రభ న్యూస్) : వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. కేశవరెడ్డి పాఠశాలకు చెందిన సాత్విక్ మూడవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. పాఠశాలలో ఉపాధ్యాయుడు చితకబాధడంతో అస్వస్థతకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ విద్యార్థి సాత్విక్ మృతిచెందాడు. తన కొడుకుని ఉపాధ్యాయుడు కొట్టడంతో మృతి చెందాడంటూ చెన్గోమల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేశవరెడ్డి పాఠశాల యజమాన్యం మాత్రం బెడ్ పై నుంచి పడడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత అక్కడ మృతి చెందాడని అంటోంది. మృతిచెందిన బాలుడి స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామం.

Advertisement

తాజా వార్తలు

Advertisement