Tuesday, April 23, 2024

మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించాలి : మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్

హనుమకొండ : జిల్లాలో అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని రాష్ట్ర మహిళా, శిశు, సంక్షేమ, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి వేడుకల పైన హనుమకొండ కలెక్టరెట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వరంగల్, హనుమకొండ కలెక్టర్ లతో, సంబంధిత అధికారులతో మంత్రి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క‌నీవిని ఎరుగ‌ని రీతిలో ఈసారి మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని సూచించారు. ఏర్పాట్ల‌కు సంబంధించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement