Monday, May 6, 2024

Breaking: తండ్రిని క‌త్తితో పొడిచి చంపేసిన కొడుకు.. గొడ‌వ‌లా, మ‌తిస్థిమితం లేక‌నా?

నిజామాబాద్ అర్బన్ (ప్ర‌భ న్యూస్‌) నిజామాబాద్ నగరంలో ఎల్లమ్మగుట్టలో తండ్రిని కొడుకు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. నగరంలోని ఖలీల్ వాడిలో ప్రైవేట్ ఆసుపత్రిలో హౌజ్ కీపింగ్ లో పని చేసే శ్యాం(55)ను ఇంటి వద్ద కొడుకు ఆనంద్ కత్తితో పొడిచి హత్య చేశాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీస్తున్నారు.

కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య సఖ్యత లేదని, తరుచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. మూడు నెలల క్రితం ఆనంద్ బ్రెయిన్ స్టోక్ వచ్చి కోలుకున్నా ఇప్పటికి మతిస్థిమితం లేనట్లే వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి డెడ్ బాడిని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు 4వ టౌన్ ఎస్సై సందీప్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement