Monday, May 6, 2024

TS: బీసీలకు చేయూత నిరంతర ప్రక్రియ.. మంత్రి గంగుల

బీసీలకు చేయూత కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మంటపంలో 686మంది లబ్ధిదారులకు మంత్రి గంగుల చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సమైక్య పాలనలో చేతి వృత్తులు ధ్వంసం అయ్యాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కనుమరుగైన కులవృత్తులను కాపాడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కులవృత్తులను ఆదుకుంటున్నారన్నారు. తెలంగాణ తెచ్చుకున్నదే వెనుకబడిన వర్గాలు ఆర్ధికంగా ఎదగాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement