Monday, April 29, 2024

Mulugu : భార్యకు కత్తిపోట్లు.. డబ్బుతో భర్త పరారీ

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో దారుణం చోటుచేసుకుంది. ప్రెగ్నెన్సీతో ఉన్న భార్యను కత్తితో పొడిచి భర్త డబ్బుతో పరారయ్యాడు. శ్యామల భర్త అనిల్ ప్రెగ్నెన్సీ తో ఉన్న భార్యని కత్తితో పొడిచి డబ్బులు లాక్కొని పారిపోయాడు. విషయం తెలుసుకున్న ములుగు జిల్లా డీసీపీఓ ఓంకార్ బృందం ఆధ్వర్యంలో అంబులెన్స్ ద్వారా అత్యవసర చికిత్స నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిల్లలను సాకలేక తనను కత్తితో పొడిచి డబ్బులు లాక్కొని పోయాడని భార్య శ్యామల తెలిపింది. ములుగు ఏరియా ఆస్పత్రిలో శ్యామలకు చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఐసీడీఎస్ బృందం ఐదుగురిని పిల్లల్ని సఖి సెంటర్ కి తరలించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement