Saturday, May 4, 2024

Breaking – అచ్యుతాపురం సెజ్‌ లోని సాహితీ ఫార్మాలో పేలుడు.. ఇద్దరు దుర్మరణం

అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సాహితీ ఫార్మాలోని రెండు రియాక్టర్ల లో పేలుడు సంభవించింది. దీంతో ఘటనాస్థలిలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో.. భయాందోళనకు గురైన కార్మికులు అక్కడ నుంచి పరుగులు తీశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ పేలుడులో ఇద్దరు కార్మికులు మరణించారు.. మరోకరు గాయపడ్డారు.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement