Saturday, April 27, 2024

NZB: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం… గంప గోవర్ధన్

బిక్కనూర్, అక్టోబర్ 28 (ప్రభ న్యూస్) : అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శనివారం మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అధికార పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గోవర్ధన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ… సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

ఆయనను భారీ మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత కార్యకర్తలపై ఎంతైనా ఉందన్నారు. ప్రతి కార్యకర్త సైనికునిగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మోసపోకుండా చూడవలసిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తిరుమలరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్, సొసైటీ ఉపాధ్యక్షులు స్వామి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement