Sunday, April 28, 2024

TS: తీగల వంతెనపై ప్రతిపక్షాల రాద్ధాంతం అర్ధరహితం… మంత్రి గంగుల

కరీంనగర్ : తీగల వంతెనపై ప్రతిపక్షాల రాద్ధాంతం అర్ధరహితమని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇవాళ తీగల వంతెనను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, చల్లా హరిశంకర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలకు కడుపు మంట, కళ్ళు మండి విష ప్రచారం చేస్తున్నాయన్నారు.

తెలంగాణకు తలమానికమైన కేబుల్ బ్రిడ్జి నిర్మాణంపై తలెత్తిన చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు, అయోమయానికి గురిచేస్తూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని.. ప్రపంచంలోనే పెద్దపెద్ద ప్రాజెక్టులు నిర్మించిన టాటా సంస్థ ఈ నిర్మాణం చేపట్టిందని, పూర్తిస్థాయిలో నాణ్యతతో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, బరస నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement