Monday, April 29, 2024

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రిపై కాంగ్రెస్ నిర‌స‌న

రైతులను మోసం చేస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పబ్లిక్ గార్డెన్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయ‌కులు ప్ల‌కార్డులు ప‌ట్టుకొని నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు మద్దికుంట నవీన్ రెడ్డి, గూడ ఐలయ్య గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సదానందం, పరశురాం గౌడ్, ధర్మారెడ్డి, అక్బర్, చెవిటి శ్రీనివాస్ , మిద్దెల సీతారాం రెడ్డి, బత్తుల చిరంజీవి, బైండ్ల దయానంద్, అంజద్, సమీర్ ఖాన్, సిరిగళ్ల బాబు, చింతకింది రమేష్, బాలరాజు, ఎల్లేశ్, నాగరాజు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement