Friday, March 29, 2024

ఏపీ గవర్నర్‌ను పరామర్శించిన సీఎం జగన్

కరోనా బారిన పడిన ఏపీ గర్నవర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ప్రస్తుతం ఏపీ గవర్నర్ హైదరాబాద్‌ లోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా.. శాసనసభ విరామ సమయంలో గవర్నర్‌ను ఫోన్‌లో పరామర్శించారు సీఎం. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు. నిన్ననే వైద్యులతో ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడానని.. సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారనే విషయాన్ని తెలిపారు. త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు.

కాగా, అస్వస్థతకు గురైన గవర్నర్‌ను నిన్న ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో బిశ్వభూషణ్‌కు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement