Tuesday, May 7, 2024

TSRTC Bus: పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. పలువురికి గాయాలు

ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో పలువురికి గాయాలైన ఘటన ఇవాళ ఉదయం హనుమకొండ జిల్లా ఓగులపూర్ వద్ద చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పెను ప్రమాదం తప్పడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

వరంగల్ 2 డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు హనుమకొండ నుంచి ఏటూరు నాగారం వెళుతోంది. ఓగులపూర్ వద్ద బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయని తెలుస్తోంది. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement