Saturday, April 27, 2024

Telangana – చేప‌ల వేట‌కు వెళ్లి ఇద్ద‌రు మృతి…

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మక్తగూడలో బుధవారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కిష్టయ్య, వెంకటేష్ లు చేపలు పట్టేందుకు చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement