Tuesday, April 30, 2024

తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ – సీఎం కేసీఆర్

తెలంగాణ ముద్దు బిడ్డ దివంగ‌త ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు అని సీఎం కేసీఆర్ కొనియాడారు.దేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న రోజుల్లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి… దేశాన్ని కాపాడిన ఆధునిక భారత నిర్మాత దివంగత ప్రధాని పీవీ నరసింహారావు అని ప్ర‌శంసించారు. నేడు పీవీ జయంతి. ఈ సందర్భంగా ఒక ప్రకటన ద్వారా ముఖ్యమంత్రి ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి బాట పట్టించిన మహోన్నతుడని కొనియాడారు. తన వినూత్నమైనటువంటి సంస్కరణలతో దేశ సంపద ఎన్నో రెట్లు పెరిగేలా చేశారని అన్నారు.

పీవీ నాయకత్వంలో దేశం ఆర్థికంగానే కాకుండా విదేశాంగ విధానం, అంతర్గత భద్రత, అణుశక్తి వంటి రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధిని సాధించిందని చెప్పారు. పీవీ నరహింహారావు నుంచి తమ ప్రభుత్వం ఎంతో స్ఫూర్తిని పొందిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ నాయకత్వం దేశానికే మార్గాన్ని చూపుతుందనే విషయాన్ని పీవీ నిరూపించారని అన్నారు. పీవీ స్పూర్థితో తాము ముందుకు సాగుతామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement