Friday, May 3, 2024

కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

పోతిరెడ్డిపాడు నుంచి నీరు తరలించకుండా ఆపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బోర్డు చైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  రజత్‌ కుమార్‌ లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీరు తరలించకుండా ఆపాలని విజ్ఞప్తి చేశారు. నాగార్జునసాగర్ నీటి అవసరాల కోసం తరలింపు ఆపాలని కోరారు. ఏపీ తన పరిమితికి మించి నీరు తీసుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించారు. ఏపీ ఇప్పటికే 25 టీఎంసీలు తరలించిందని లేఖలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 10.48 టీఎంసీలనే ఏపీ తీసుకోవాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement