Saturday, April 27, 2024

రెండున్నరేళ్లలో లక్ష కోట్లు.. ద‌ళితుల అభివృద్ధికి ఖర్చు

రెండున్న‌రేళ్ల‌లో తెలంగాణ‌లో ద‌ళితుల అభివృద్ధికి ల‌క్ష కోట్ల రూపాయాలు ఖ‌ర్చు చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి హరీష్ రావు అన్నారు. వచ్చే సంవత్సరం దళిత బంధు కింద బడ్జెట్ లో రూ.20 నుంచి 30 వేల కోట్లు కేటాయించాలని సీఎం ఆర్థిక శాఖను ఆదేశించారని తెలిపారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో నిధులు రూ. 50 లక్షలతో నిర్మించనున్న డా.బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనీటి భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు భూమి పూజచేశారు. చేర్యాలలో రూ.కోటి 25 లక్షలతో అన్ని హంగులతో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనo నిర్మిస్తామ‌ని మంత్రి తెలిపారు. ఇప్ప‌టికే ఈ భ‌వన నిర్మాణానికి రూ. 50 ల‌క్ష‌ల‌ను మంజూరు చేశామ‌న్నారు. మ‌రో రూ.75 ల‌క్ష‌లు మంజూరు చేసి.. మొత్తంగా కోటి 25 ల‌క్ష‌ల‌తో అన్ని హంగుల‌తో భ‌వ‌నం నిర్మిస్తామ‌ని మంత్రి హరీష్ రావు చెప్పారు. 

ఇది కూడా చదవండి: హుజురాబాద్ కు రూ.500 కోట్లు.. దళిత బంధు నిధులు విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement