Friday, March 29, 2024

వీడియో: ఇంద్రవెల్లికి దండు కట్టింది..

కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన‌ ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ నేప‌థ్యంలో హైదరాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్ నుంచి ఇంద్ర‌వెల్లికి ఆయ‌న ర్యాలీగా బ‌య‌లుదేరారు. దీంతో రేవంత్ కాన్వయ్ వెంబడీ భారీగా అభిమానులు, కార్యకర్తలు ర్యాలీగాత‌ర‌లివెళుతున్నారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. కాసేపట్లో బహిరంగ సభకు చేరుకుని ప్ర‌సంగిస్తారు. సుమారు 18 ఎకరాల స్థలంలో లక్ష మంది వచ్చేలా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇంద్ర‌వెల్లి స‌భ నేప‌థ్యంలో ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డుతోంది. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ద‌ళిత బంధు ప‌థ‌కానికి కౌంట‌ర్‌గా ఈ స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. ముందు ఆయ‌న గుడిహత్నూర్‌ చేరుకుని యూత్‌ కాంగ్రెస్‌ నిర్వహించే జెండా కార్యక్రమంలో పాల్గొని, ఆ తర్వాత ఇంద్రవెల్లి చేరుకుని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ కు రూ.500 కోట్లు.. దళిత బంధు నిధులు విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement