Saturday, May 4, 2024

హరిత నిధికి తెలంగాణ‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

హరితహారం పథకానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు తెలంగాణ‌ రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆకుపచ్చ తెలంగాణగా మార్చడానికి కేసీఆర్‌ సర్కార్‌ నిరంతరం కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ పథకాన్ని గ్రామస్థాయి నుంచి అమలు చేసి హరిత తెలంగాణ నిర్మించడంలో ప్రభుత్వం కొంతమేరకు విజయవంతం అయిందని చెప్పవచ్చు. తాజాగా ఈ పథకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం కొనసాగాడానికి హరిత నిధిని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి అటవీ పర్యావరణ శాఖ మంత్రి చైర్మన్‌గా, రాష్ర్టస్థాయిలో కమిటీ ఏర్పాటు చేసింది. హరిత నిధి వినియోగానికి నోడల్‌ ఏజెన్సీగా అటవీ శాఖ వ్యవహరించనుంది.

కాగా ప్రభుత్వం 2015 నుంచి హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఏడాది రెండు విడతలుగా నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో మంచి ఫలితాలు వచ్చాయి. ఈ పథకంలో గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి మంచి ఫలితాలు సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప‌థ‌కాన్ని ఇలాగే కొన‌సాగించేందుకు ఎలాంటి ఆటంకాల్లేకుండా ఉండేందుకు హ‌రిత నిధికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఒకే చెప్పింది. అయితే శాసనసభ స‌మావేశాల్లో సీఎం కేసీఆర్ అక్టోబర్‌ ఒకటిన హరితనిధి ఏర్పాటుపై ప్రకటన చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాల నుంచి విరాళాలు సేకరించి ‘హరిత నిధి’కి నిధులు సమకూరుస్తామని చెప్పిన విష‌యం విదిత‌మే..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement