Thursday, April 25, 2024

మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు వాయిదా : 17మంది కంటెస్టెంట్ల‌కి క‌రోనా

మిస్ ఇండియా 2020 మాన‌స వార‌ణాసి క‌రోనా బారిన ప‌డింది. మిస్ వ‌ర‌ల్డ్ 2021పోటీల్లో ఇండియా త‌ర‌పున మాన‌స పోటీకి వెళ్ళింది. కాగా అందాల పోటీలో పాల్గొంటున్న పలువురు అందాల భామ‌ల‌కి క‌రోనా సోకింది. దాంతో ఫైన‌ల్స్ ఈవెంట్ ని నిలిపివేశారు. ఈ ఈవెంట్ ప్రారంభంకావ‌డానికి కొన్ని గంట‌ల ముందు మిస్ వరల్డ్ నిర్వాహకుల నుంచి ఈ ప్రకటన వెలువడింది. ప్యూర్టోరికోలో ఫైనల్స్ జరగాల్సి ఉంది.

మరోవైపు కంటెస్టెంట్లందరూ ప్యూర్టోరికోలో ఐసొలేషన్ లో ఉన్నారు. కరోనా బారిన పడుతున్న కంటెస్టెంట్ల సంఖ్య పెరుగుతుండటంతో మిస్ వరల్డ్ ఫైనల్స్ ను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు అధికారిక‌ ప్రకటన ద్వారా నిర్వాహకులు తెలిపారు. 90 రోజుల వ్యవధిలో ప్యూర్టోరికోలో ఫైనల్స్ నిర్వహిస్తామన్నారు.కాగా మొత్తం 17 మంది కంటెస్టెంట్లు, స్టాఫ్ మెంబర్లు కరోనా బారిన పడ్డారు. వారికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement