Sunday, May 19, 2024

Telangana Devotees – మదురైలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు అయ్యప్ప భక్తులు దుర్మరణం

తమిళనాడు రాష్ట్రం మదురైలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి వస్తుండగా తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. కేరళ మదురై ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన ముగ్గురు అయ్యప్ప దీక్షాపరులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. శబరిమల నుంచి తిరిగి వస్తున్న క్రమంలో మద్రాస్‌ బైపాస్‌ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement