Monday, April 29, 2024

రేవంత్ ఛైర్మన్ గా 26 మందితో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల సందడి నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీ నేతలు ఇప్పటినుంచే సిద్దమవుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో. ఇక్కడి నేతల్లో కూడా జోష్ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్. తో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం నుంచి మరో కీలక ప్రకటన వెలువడుతుంది. తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సహా 26 మంది సభ్యులకు ఈ కమిటీలో చోటు కల్పించారు.రేవంత్ రెడ్డి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

.ఈ కమిటీ ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోద ముద్ర వేశారని.. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇక, ఈ కమిటీలో ఎక్స్ అఫిషియో మెంబర్స్‌గా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, స్టేట్ సేవా దళ్ చీఫ్ ఆర్గనైజర్ ఉండనున్నారు.

కమిటీలో సభ్యులు..1. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి2. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క3. ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి4. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్5. జగ్గారెడ్డి 6. గీతారెడ్డి7. మహమ్మద్ అజారుద్దీన్8. అంజన్ కుమార్ యాదవ్9. అంజన్ కుమార్ యాదవ్

10. వి హనమంతరావు 11. పొన్నాల లక్ష్మయ్య12. ఉత్తమ్ కుమార్ రెడ్డి13. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి14. దామోదర రాజనర్సింహ15. మధుయాష్కి గౌడ్16. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు17. చల్లా వంశీచంద్ రెడ్డి18. ఎస్‌ఏ సంపత్ కుమార్19. రేణుకా చౌదరి20. బలరాం నాయక్21. పొడెం వీరయ్య22. సీతక్క23. షబ్బీర్ అలీ24. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి25. ప్రేమ్‌సాగర్ రావు26. సునీతా రావు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement