Thursday, May 2, 2024

TS: ఎన్నిక‌ల్లో టీడీపీ స‌హ‌కారం మ‌రువ‌లేనిది – మంత్రి పొంగులేటి..

ఖ‌మ్మం – అహంకార పూరిత ప్రభుత్వంను ఓడించేందుకు టీడీపీ కృషి మరువలేనిదన్నారు రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జిల్లా రాజకీయాల్లో అహంకారానికి తాము ఎప్పుడూ వెళ్ల‌బోమన్నారు. ఎన్నిక‌ల్లో త‌మ‌కు సహకరించిన వారిని ఎప్పుడూ మర్చి పోజాల‌మని తెలిపారు.

ఖమ్మం జిల్లా సీపీఐ, టీడీపీ, ప్రజాపంథా కార్యాలయాల్లో నేడు జ‌రిగిన ఆత్మీయ సమావేశాల్లో ఆయ‌న పాల్గొని మాట్లాడుతూ… కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఓడించేందుకు టీడీపీ నిద్రపోకుండా కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేశారని అన్నారు. చిత్తశుద్దితో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సీపీఐఎంఎల్ ప్రజా పందా కూడా ఎంత‌గానో సహకరించిందన్నారు. వందకు వంద శాతం అభయ హస్తం ద్వారా ప్ర‌క‌టించిన ఆరు గ్యారెంటీలను అమలు పర్చుతామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement