Saturday, April 27, 2024

ఎండల్లో హాయ్..హాయ్..

సిద్దిపేట, ప్రభన్యూస్ : పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు కావటంతో వేసవితాపం నుంచి సేదతీరేందుకు చిన్నారులు ఈతనే ప్రత్నామ్నాయంగా ఎంచుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని ఈత కొలను నిత్యం బాలబాలికలతో కిక్కిరుస్తోంది. దీంతో స్విమ్మింగ్‌ ఫూళ్ల వద్ద తల్లిదండ్రులు, పిల్లలతో సందడి నెలకొంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బాలబాలికలు ఈత కొలనుకు వచ్చి కోచ్‌ సహకారంతో ఈతను నేర్చుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. వీరితో పాటు క్రీడాకారులు, పెద్దలు కూడా కొలనులో ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు. ఎండలు విపరీతంగా పెరిగిన కారణంగా ఉపశమనం పొందేందుకు స్విమ్మింగ్‌ ఫూల్‌ను ఆశ్రయిస్తున్నారు. పిల్లలు ఈతను నేర్చుకుంటుంటే తల్లిదండ్రులు చూస్తూ తన్మయత్వం పొందుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement