Tuesday, April 30, 2024

టిఆర్ఎస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులుగా స్వామి నాయక్

టిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులుగా టీక్యా తండా గ్రామానికి చెందిన జాటోత్ స్వామి నాయక్ బుధవారం నియమితులయ్యారు.ఈ సందర్భంగా గురువారం స్వామి నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించినందుకు గిరిజనులను ఏకం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాల పై మండలంలోని తండా వాసులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన మంత్రి దయాకర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ సోమేశ్వర రావు,రైతు సమన్వయ సమితి చైర్మన్ దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ గ్రామ ఇన్చార్జి కుర్ర శ్రీనివాస్, TRS మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Corona: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్.. తస్మాత్ జాగ్రత్త

Advertisement

తాజా వార్తలు

Advertisement