Saturday, May 4, 2024

కేటీపీపీ ప్రమాదంపై అధికారులపై వేటు.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్

భూపాలపల్లి, ప్రభ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ ధర్మల్ పవర్ ప్లాంట్ లో సోమవారం జరిగిన ఫైర్ ఆక్సిడెంట్ లో ఏడుగురు తీవ్రగాయాలైన ఘటన విధితమే.ఈ ప్రమాదంలో ఒకరు బుధవారం మరణించారు. సిరియస్ గా తీసుకున్న యాజమాన్యం జెన్కో డైరెక్టర్ లు రంగంలోకి దిగి ప్రాథమిక విచారణ చేపట్టారు. దీనితో కేటిపిపిలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి, ఒక అధికారి పై బదిలీ వేటు వేశారు. కెటిపిపిలో మిల్ మెయింటెనెన్స్ ఏ.ఈ సాకేత్, రూప ఏడీఈ లను సస్పెండ్ చేయగా, శివ మోహన్ డీఈ షిఫ్ట్,అధికారి పై బదిలీ వేటు వేస్తూ జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement